దుర్గి(గుంటూరు), న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాదాసు సాంబశివరావు(40)ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి తుపాకీతో కాల్చి చంపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి వుంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దుర్గి మండలం కంచరగుంటకు చెందిన సాంబశివరావు రాత్రి ఇంట్లో ఒక్కరే నిద్రిస్తుండగా, భార్యా పిల్లలు డాబా పై నిద్రిస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో కొందరు వచ్చి సాంబశివరావుపై దాడి చేసి తుపాకీతో కాల్చడం వల్లే మృతి చెందాడని భార్య రాణి రోదిస్తూ తెలిపింది. మృతుని ఎడమ ఛాతిపై బుల్లెట్ గాయాలున్నట్టు తెలుస్తోంది. మాచర్ల తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్గి చేరుకుని బాధిత కుటుంబీకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Home »
» వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త హత్య
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment