వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భద్రతను తిరుపతి పోలీసులు గాలికొదిలేశారు. జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్కు భద్రత కల్పించే విషయాన్ని విస్మరించి కాలక్షేపంలో మునిగితేలారు. తిరుపతిలో తొలిరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్ జగన్ భద్రత కల్పించే విషయంలో పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. జగన్ పర్యటించే ప్రాంతాలు, సభలు జరిగే స్థలాల వివరాల షెడ్యూల్ను స్థానికనేతలు ముందుగానే అందించినప్పటికీ పోలీసులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్కు గట్టి బందోబస్తు కల్పించాల్సిన పోలీసులు వాహనాల్లోనే కూర్చొని కాలక్షేపం చేశారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో జగన్ చుట్టుపక్కల ఒక్క పోలీసు కనిపించలేదంటే ఆయన భద్రతను ఎంత నిర్లక్ష్యం చేశారో తెలుస్తోంది. జనం తోసుకురావటంతో రెండు మూడు చోట్ల జగన్ కింద పడబోయారు కూడా. అయినా పోలీసుల్లో ఎలాంటి స్పందన లేదు సరికదా...నిర్లక్ష్యపు సమాధానం. వైఎస్ జగన్ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో ప్రమాదాలు జరిగితే అందుకు పోలీసులు ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
Home »
» జగన్ కు భద్రత కరువు
జగన్ కు భద్రత కరువు
Written By news on Wednesday, May 2, 2012 | 5/02/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment