ఎమ్మార్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై సీబీఐ ఎందుకు ఆరా తీయడంలేదని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డులో గోల్ఫ్ సంస్థకు 520 ఎకరాలను ఎకరా 29 లక్షలకే కేటాయించారని ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలు సీబీఐకి తెలియవా వైఎస్ జగన్ అన్నారు.
తిరుపతి రైల్వేకాలనీ రోడ్షోలో సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం రిమోట్ కంట్రోల్తో రాష్ట్రాన్ని నడిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి పదవి వార్తలతో ఎమ్ఎల్ఏ పదవికి చిరంజీవి రాజీనామా చేయడం దారుణమన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేక పోతున్నానంటూ రాజీనామా చేసుంటే తాను చిరంజీవికి సెల్యూట్ చేసేవాడినని తిరుపతి రైల్వేకాలనీ రోడ్షోలో వైఎస్ జగన్ అన్నారు.
తిరుపతి రైల్వేకాలనీ రోడ్షోలో సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం రిమోట్ కంట్రోల్తో రాష్ట్రాన్ని నడిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి పదవి వార్తలతో ఎమ్ఎల్ఏ పదవికి చిరంజీవి రాజీనామా చేయడం దారుణమన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించలేక పోతున్నానంటూ రాజీనామా చేసుంటే తాను చిరంజీవికి సెల్యూట్ చేసేవాడినని తిరుపతి రైల్వేకాలనీ రోడ్షోలో వైఎస్ జగన్ అన్నారు.
0 comments:
Post a Comment