వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శనంపై వివాదం తగదని మాజీ మంత్రి శంకరరావు హితవు పలికారు. హిందూ మతం గంగానది లాంటిది. వెంకటేశ్వరస్వామిని ఎవరైనా దర్శించుకోవచ్చు. స్వామివారి దర్వనాన్ని వివాదం చేయడం హిందూ మతానికే అపచారం చేసినట్లు అని ఆయన అన్నారు. జగన్ తిరుమల దర్శనం వివాదానికి కాంగ్రెస్ నేతలు ఫులిస్టాప్ పెట్టకపోతే అది బూమారంగై కాంగ్రెస్నే దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించినందుకు తనని మంత్రి మండలి నుంచి తొలగించారని, అగ్రకుల మంత్రి సిఎంని విమర్శిస్తే ఎందుకు తొలగించలేదన్న భావన ప్రజల్లో ఉందన్నారు. మద్దిలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించినందుకు తనని మంత్రి మండలి నుంచి తొలగించారని, అగ్రకుల మంత్రి సిఎంని విమర్శిస్తే ఎందుకు తొలగించలేదన్న భావన ప్రజల్లో ఉందన్నారు. మద్దిలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
0 comments:
Post a Comment