బుధవారం నుంచి పార్టీ అభ్యర్థుల తరపున వై.ఎస్.విజయమ్మ ప్రచారం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘30న ఉదయం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విజయమ్మ ప్రచారం నిర్వహించి.. అదే రోజు సాయంత్రం విశాఖ జిల్లా పాయకరావు పేటలో ప్రచారం చేస్తారు. 31న ఉదయం పాయకరావుపేట, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పర్యటిస్తారు. జూన్ 1వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, 2న పోలవరం, 3న గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో విజయమ్మ ప్రచారం చేస్తారు’ అని వివరించారు. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని రఘురామ్ పేర్కొన్నారు.
Home »
» రేపట్నుంచి విజయమ్మ ప్రచారం
రేపట్నుంచి విజయమ్మ ప్రచారం
Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment