కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ

కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ

Written By news on Friday, May 18, 2012 | 5/18/2012

రాబోయే ఉప ఎన్నికల్లో ఈసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తాము జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటే తప్ప ఓటు వేయడం కుదరదని ఈసీ తెలిపింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల కమీషనర్ హెచ్.ఎస్ బ్రహ్మ మీడియాతో మాట్లాడారు. ఏదో ఒక గుర్తింపు కార్డుతో ఓటు వేయడం కుదరదన్నారు. తాము జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. 

ఈవీఎంలకు ప్రింటర్‌ను అనుసంధానించే ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.రాష్ర్టంలో జరుగనున్న ఉప ఎన్నికల ఏర్పాట్లును బ్రహ్మ పరిశీలించారు. పోలీసు,ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల జరిగే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Share this article :

0 comments: