'సాక్షి' అంటేనే కాంగ్రెస్ సర్కార్కు వణుకుపుడుతోందని, అందుకే అర్ధరాత్రి జీఓలు విడుదల చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా విమర్శించారు. జగన్పై కక్షసాధింపుతో 'సాక్షి'ని అణగదొక్కాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వివాదాస్పద జీవోలకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ జీవోపై సంతకం చేయటం సిగ్గుచేటన్నారు. 'సాక్షి'ని చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయపడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు.
Home »
» వణుకుతున్న కాంగ్రెస్ సర్కారు: రోజా
వణుకుతున్న కాంగ్రెస్ సర్కారు: రోజా
Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment