జగన్‌ను రేపు కోర్టులో హాజరు పరుస్తాం: సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను రేపు కోర్టులో హాజరు పరుస్తాం: సీబీఐ

జగన్‌ను రేపు కోర్టులో హాజరు పరుస్తాం: సీబీఐ

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

 అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌ను రేపు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ప్రవేశ పెడతారు. ఈమేరకు సీబీఐ అధికారులు ఒక ప్రకటన చేశారు. ఆయనపై భారత శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఐపీసీ 420, 120బీ, 477ఏ, 409 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజులుగా జగన్‌ను విచారిస్తోన్న సీబీఐ ఈ సాయంత్రం 7.20 గంటలకు ఆయనను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.


దిల్‌కుషాలో జగన్‌ను కలిసిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టు అయిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జగన్‌ను దిల్‌కుషా అతిథి గృహంలో ఆదివారం రాత్రి కలిశారు. జగన్‌ను కలిసిన వారిలో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, జగన్ భార్య భారతి, సోదరి షర్మిలా, బావ అనిల్, వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఉన్నారు. ఈ సమయంలో వీరు భావోద్వేగానికి లోనయ్యారు.
Share this article :

0 comments: