తిరుపతి: జనం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని దూరం చేయడానికి కుట్రపన్నారని, కాంగ్రెస్ నాటకంలోని భాగమే సిబిఐ విచారణ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. 8 నెలలుగా విచారణ చేయని సిబిఐ ఇప్పుడే జగన్ను ఎందుకు ప్రశ్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభంజనాన్ని చూసి కాంగ్రెస్, టిడిపిలకు వెన్నులో చలిపుడుతోందన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఉపఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్లను ప్రజలు చిత్తుగా ఓడిస్తారని భూమన హెచ్చరించారు.
Home »
» 'కాంగ్రెస్ నాటకంలో భాగమే సిబిఐ విచారణ'
'కాంగ్రెస్ నాటకంలో భాగమే సిబిఐ విచారణ'
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment