అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో ముగ్గురు ఎంపీలు జగన్మోహన్రెడ్డికి మద్దతిచ్చేందుకు ముందుకు రానున్నారని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఈ ఎంపీలు ఎవరు, ఏ ప్రాంతం వారనేది తానిప్పుడే చెప్పలేనని, రెండుమూడు రోజుల్లో మీరే చూస్తారని తెలిపారు. శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. జగన్కు సంఘీభావం తెలిపే వారి సంఖ్య ఇంతటితో ఆగుతుందని తాను భావించడంలేదని, మున్ముందు మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. జగన్ విషయంలో సీబీఐ ఇప్పటి దాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోమవారం కోర్టుకు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరిగేందుకు కుట్ర జరుగుతోందని జగన్ పలుమార్లు చెప్పారని, ఆ కుట్రలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కలవద్దని కూడా సూచించారని గుర్తుచేశారు. పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో కార్యకర్తలు బలికాకుండా, వాటికి దూరంగా ఉండాలని చెప్పారు.
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా..
అంతకుముందు సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్కుశ అతిథి గృహం వెలుపల సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రస్తుతం రెడీగా ఉన్నారని, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటీ రెండు రోజుల్లో రానున్నారని ఆయన వివరించారు. జగన్ అరెస్టవుతారనే వార్తలను ఆయన ఖండించారు. సోమవారంనాడు కోర్టులో హాజరైన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.
0 comments:
Post a Comment