ఉపఎన్నికలో టీడీపీ - కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అందుకే తిరుపతి అర్బన్ ఎస్ పి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో మతాల మధ్య గొడవ పెట్టే విధంగా మాట్లాడిన చంద్రబాబుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమని అర్బన్ ఎస్ పి పట్టించుకోలేదన్నారు. రెండు గంటలపాటు అర్బన్ ఎస్ పి కార్యాలయంలో వేచి చూశామని చెప్పారు. ఎస్ పి కార్యాలయంలో ఉండి కూడా సెలవులో ఉన్నానని చెప్పారని తెలిపారు. ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించినట్లు చెప్పారు. చివరకు ఆర్ డిఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుపై పీపుల్స్ రిప్రజంట్ యాక్ట్ ప్రకారం 425 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Home »
» ఉపఎన్నికలో టీడీపీ - కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
ఉపఎన్నికలో టీడీపీ - కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment