చిత్తూరు: వైఎస్ జగన్ను అరెస్టు చేస్తారనే ఆందోళనతో ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వెదురుకుప్పం మండలం చౌడేపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం (42) ఈరోజు ఉదయం టీవీ చూస్తూ మరణించాడు. మృతునికి ముగ్గురు కుమార్తెలు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా సుబ్రహ్మణ్యం లబ్ధి పొందాడు. కాగా ఈ ఘటన మరవక ముందే జగన్ ను అరెస్ట్ చేస్తారనే మనస్తాపంతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం నడుమూరుకు చెందిన ఈశ్వర్రెడ్డి (29) విషం తాగి ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. |
Home »
» గుండెపోటుతో జగన్ అభిమాని మృతి
గుండెపోటుతో జగన్ అభిమాని మృతి
Written By news on Friday, May 25, 2012 | 5/25/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment