స్వపక్షంలో అన్నపై విమర్శలు తట్టుకోలేకపోయా
త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తా: వైఎస్ వివేకా
పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా) న్యూస్లైన్: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను తట్టుకోలేక కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్ ప్రణాళిక ప్రకటించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పులివెందుల ప్రాంతంలో అభివృద్ధి కోసమే తాను గతంలో మంత్రి పదవి చేపట్టానని వివరించారు. కుటుంబ సభ్యులందరితో విభేదించి పార్టీకి సేవ చేశానన్నారు. సీఎం కిరణ్కుమార్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులను పట్టించుకోని ప్రభుత్వంలో కొనసాగాలంటే చాలా కష్టంగా ఉందన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పట్టించుకోక పోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు. వైఎస్పై విమర్శలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెబుతున్నా వారు పదే పదే తమ రాజకీయ స్వార్థం కోసం, వారి పదవులు కాపాడుకోవడానికి వైఎస్ను దోషిగా చూపుతూ లేనిపోని ఆరోపణ చేయడం చాలా బాధాకరమన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏ పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే పరితపించేవారన్నారు. అలాంటి వ్యక్తిపై అసత్య ప్రచారం చేయడం చాలా బాధగా ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పార్టీ నుంచి వైదొలగుతున్నానని వివరించారు. నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో చర్చించి తన భవిష్యత్ ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తానన్నారు.
త్వరలో భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తా: వైఎస్ వివేకా
పులివెందుల(వైఎస్ఆర్ జిల్లా) న్యూస్లైన్: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలను తట్టుకోలేక కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ప్రకటించారు. కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్ ప్రణాళిక ప్రకటించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పులివెందుల ప్రాంతంలో అభివృద్ధి కోసమే తాను గతంలో మంత్రి పదవి చేపట్టానని వివరించారు. కుటుంబ సభ్యులందరితో విభేదించి పార్టీకి సేవ చేశానన్నారు. సీఎం కిరణ్కుమార్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులను పట్టించుకోని ప్రభుత్వంలో కొనసాగాలంటే చాలా కష్టంగా ఉందన్నారు.
వైఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనను పట్టించుకోక పోవడం ఆవేదనకు గురి చేసిందన్నారు. వైఎస్పై విమర్శలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెబుతున్నా వారు పదే పదే తమ రాజకీయ స్వార్థం కోసం, వారి పదవులు కాపాడుకోవడానికి వైఎస్ను దోషిగా చూపుతూ లేనిపోని ఆరోపణ చేయడం చాలా బాధాకరమన్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ఏ పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే పరితపించేవారన్నారు. అలాంటి వ్యక్తిపై అసత్య ప్రచారం చేయడం చాలా బాధగా ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పార్టీ నుంచి వైదొలగుతున్నానని వివరించారు. నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో చర్చించి తన భవిష్యత్ ప్రణాళిక త్వరలోనే ప్రకటిస్తానన్నారు.
0 comments:
Post a Comment