వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటనకు సిర్వం సిద్ధమైంది. తొలిసారిగా ఉప ఎన్నికల ప్రచారం కోసం విచ్చేస్తున్న ప్రియతమ నాయకుడికి ఘనస్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు సన్నాహాలు చేసుకున్నారు. మంగళ, బుధవారాల్లో తిరుపతిలో జగన్ రోడ్షో ఉంటుంది. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి పర్యటన పూర్తయ్యే వరకు తమ నాయకుడి వెన్నంటి వుండి పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నికల కోడ్ అడ్డురావడంతో బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదు.
ప్రచార రథాలు సిద్ధం
వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్ షో, ఎన్నికల ప్రచారం కోసం రెండు ప్రచార రథాలను పార్టీ నగర శాఖ సిద్ధం చేసింది. లైటింగ్, లౌడ్ స్పీకర్లు ఇతర హంగులతో ప్రత్యేక వాహనాలను రథాలకు అనుబంధంగా సిద్ధం చేశారు. రోడ్ షో ప్రారంభమైన తర్వాత తొలి సమావేశం జరుగుతున్నప్పుడు రెండో ప్రచార రథం నిర్దేశిత రెండవ ప్రాంతంలో సిద్ధంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి జనసభ ముగిసిన తర్వాత ప్రచార రథం మూడవ జనసభ జరిగే ప్రదేశానికి చేరుకుని జగన్మోహన్రెడ్డి రాక కోసం తయారుగా వుంటుంది.
జగన్మోహన్రెడ్డి వచ్చే వరకు జిల్లాస్థాయి నా యకులు ప్రజలనుద్దేశించి ప్రసంగాలు చేస్తారు. రోడ్షో, ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించి స్థానిక నాయకత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు చేయడానికి పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గోవిందరెడ్డి, పార్టీ ఉప ఎన్నికల పరిశీలకుడు ఏఎస్ మనోహర్తోపాటు, ఆర్కె రోజా కూడా తిరుపతి చేరుకున్నారు.
సినీ నటుడు విజయచందర్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొంటారు. రోడ్షోలో భాగంగా రెండు రోజుల పాటు 25 చోట్ల జరిగే జనసభలకు మంగళవారం సాయంత్రం జరిగే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్మోహన్రెడ్డి సభలకు తిరుపతి నియోజకవర్గ సమావేశానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున తదనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రచార రథాలు సిద్ధం
వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్ షో, ఎన్నికల ప్రచారం కోసం రెండు ప్రచార రథాలను పార్టీ నగర శాఖ సిద్ధం చేసింది. లైటింగ్, లౌడ్ స్పీకర్లు ఇతర హంగులతో ప్రత్యేక వాహనాలను రథాలకు అనుబంధంగా సిద్ధం చేశారు. రోడ్ షో ప్రారంభమైన తర్వాత తొలి సమావేశం జరుగుతున్నప్పుడు రెండో ప్రచార రథం నిర్దేశిత రెండవ ప్రాంతంలో సిద్ధంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి జనసభ ముగిసిన తర్వాత ప్రచార రథం మూడవ జనసభ జరిగే ప్రదేశానికి చేరుకుని జగన్మోహన్రెడ్డి రాక కోసం తయారుగా వుంటుంది.
జగన్మోహన్రెడ్డి వచ్చే వరకు జిల్లాస్థాయి నా యకులు ప్రజలనుద్దేశించి ప్రసంగాలు చేస్తారు. రోడ్షో, ప్రచార కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించి స్థానిక నాయకత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు చేయడానికి పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గోవిందరెడ్డి, పార్టీ ఉప ఎన్నికల పరిశీలకుడు ఏఎస్ మనోహర్తోపాటు, ఆర్కె రోజా కూడా తిరుపతి చేరుకున్నారు.
సినీ నటుడు విజయచందర్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పాల్గొంటారు. రోడ్షోలో భాగంగా రెండు రోజుల పాటు 25 చోట్ల జరిగే జనసభలకు మంగళవారం సాయంత్రం జరిగే బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్మోహన్రెడ్డి సభలకు తిరుపతి నియోజకవర్గ సమావేశానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున తదనుగుణమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
0 comments:
Post a Comment