'పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు'

'పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించరాదు'

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

రాజకీయాల్ని రాజకీయంగానే ఎదుర్కొవాలే తప్ప ప్రజా ప్రయోజనాల్ని దెబ్బతీసే విధంగా వ్యవరించరాదని ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న వాతావరణం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించకుండా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.

వ్యక్తిగత, రాజకీయ కక్షలతో పాలకులు అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించారని వార్త బిజినెస్ ఎడిటర్ ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వివాదాలకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. సెజ్ ల వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా తక్కువన్నారు. వ్యక్తిగత కక్షలతో పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించటం మంచిది కాదని ప్రసాద్ రెడ్డి సూచించారు.

జర్నలిస్ట్ ల మధ్య చీలిక తేవడాని ప్రయత్నించేకన్నా తమ ఛానెల్లో, పత్రికలో పనిచేసే ఉద్యోగులను సరిగ్గా చూసుకునే విషయంపై దృష్టి పెట్టాలని జర్నలిస్ట్ సంఘ నేత అమర్ అన్నారు. మీడియా ప్రచారంతో రాజకీయ పార్టీలు గెలుస్తాయంటే.. ఇందిరా గాంధీ ఓడిపోవడానికి ఏ మీడియా సహకరించినది ప్రశ్నించారు. మీడియాలో వస్తున్న పెట్టుబడులన్నింటిపై విచారణ జరిపించాలని అభిప్రాయపడ్డారు. 

సాక్షిపై సీబీఐ చర్యలు ప్రతికాస్వేఛ్చకు ఆటంకం కలగించడమేనని ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి అన్నారు. సాక్షిపై దాడులకు తమ బాధ్యత లేదన్న రాష్ట్ర సర్కారు రాత్రికి రాత్రే జీవో ఎందుకు జారీ చేయాల్సివచ్చిందని ప్రశ్నించారు.
Share this article :

0 comments: