రాష్ట్రంలో ఓ పార్టీ అధినేత జగన్ను అరెస్ట్ చేసే సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఎందుకు సంప్రదించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, ఎటువంటి సందేహాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం అధికారి భన్వర్లాల్ చర్యలు చేపట్టాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యదర్శివర్గ సమావేశం ముగింపు సందర్భంగా ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఓ చిన్న అధికారి బదిలీని సైతం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళుతున్న ప్రభుత్వం-జగన్ అరెస్ట్, ఎన్నికలపై దాని ప్రభావం వంటి అంశాలపై ఎందుకు సంప్రదించలేదన్నారు.
మోపిదేవి ఒక్కడే దోషా
సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న అనుమానాన్ని రాఘవులు వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం సీబీఐని వినియోగించుకుంటున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అక్రమ జీవోలు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో తెలుసుకునేందుకు సీబీఐ ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు. మంత్రి మోపిదేవి ఒక్కడే దోషా? మిగతా వారు కాదా? అని ప్రశ్నించారు.
మోపిదేవి ఒక్కడే దోషా
సీబీఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న అనుమానాన్ని రాఘవులు వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాల కోసం సీబీఐని వినియోగించుకుంటున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అక్రమ జీవోలు ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో తెలుసుకునేందుకు సీబీఐ ఎందుకు ఆసక్తి చూపడం లేదని నిలదీశారు. మంత్రి మోపిదేవి ఒక్కడే దోషా? మిగతా వారు కాదా? అని ప్రశ్నించారు.
0 comments:
Post a Comment