సీబీఐతో 'సాక్షి' గొంతు నొక్కడం ద్వారా జగన్ ను దెబ్బతీయడానికి కిరణ్ సర్కారు ప్రయత్నించడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కట్టకట్టుకుని ఏకమైనా జగన్ ను ఏమీ చేయలేవని ఆయన అన్నారు. 'సాక్షి' మీడియాకు ప్రకటనలు నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని ఆయన స్వాగతించారు. అంతిమంగా ధర్మం, న్యాయం గెలిచి తీరుతుందని అన్నారు.
జగన్ పై ఎన్నికుట్రలు చేసినా చట్టపరంగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయపోరాటం చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. 'సాక్షి'పై ఎల్లో మీడియా చేస్తున్నఅసత్య ప్రచారాన్నినమ్మొద్దని వైఎస్ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలడంతో కాంగ్రెస్ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మరణాంతరం నుంచి జరుగుతున్నరాజకీయ పరిణామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
జగన్ పై ఎన్నికుట్రలు చేసినా చట్టపరంగా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయపోరాటం చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. 'సాక్షి'పై ఎల్లో మీడియా చేస్తున్నఅసత్య ప్రచారాన్నినమ్మొద్దని వైఎస్ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలడంతో కాంగ్రెస్ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ మరణాంతరం నుంచి జరుగుతున్నరాజకీయ పరిణామాలన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
0 comments:
Post a Comment