సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్తో కలిసి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే ఒకరు భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ మాటకారి ఎమ్మెల్యే భానుకిరణ్ను అడ్డం పెట్టుకుని రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భూ దందాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి కుమారుడితో పాటు, మరో మంత్రి బంధువు కూడా భాను భూ దందాలకు తోడ్పాటునందించినట్లు తెలిసింది. రాజధాని శివార్లలో భూ దందాలు, సెటిల్మెంట్లకు వారు భానుకిరణ్ను ఉపయోగించుకున్నట్లు తేలింది. తొమ్మిది రోజులపాటు సీఐడీ కస్టడీలో ఉన్న భానుకిరణ్ అధికార, ప్రతిపక్ష నేతలతో కలిసి తాను చేసిన భూ దందాల వివరాలను పూస గుచ్చినట్లు వెల్లడించాడు. టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడితో కలిసి చేసిన దందాల వివరాలను కూడా బట్టబయలు చేశాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో వందల కోట్ల విలువైన అనేక ఎకరాల భూమి సెటిల్మెంట్లో టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ విచారణలో భాను వెల్లడించాడు. అయితే భానుకిరణ్ చెపుతున్న విషయాలకు అనుగుణంగా పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే.. అతనితో కలిసి సెటిల్మెంట్లలో పాల్గొన్నవారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని సీఐడీ అధికారులు చెప్పారు.
Home »
» టీడీపీ యువ ఎమ్మేల్యేతో భాను బంధం!
టీడీపీ యువ ఎమ్మేల్యేతో భాను బంధం!
Written By news on Saturday, May 5, 2012 | 5/05/2012
సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్తో కలిసి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ ఎమ్మెల్యే ఒకరు భారీ స్థాయిలో సెటిల్మెంట్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ మాటకారి ఎమ్మెల్యే భానుకిరణ్ను అడ్డం పెట్టుకుని రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో భూ దందాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో బయటపడింది. తెలంగాణకు చెందిన ఓ సీనియర్ మంత్రి కుమారుడితో పాటు, మరో మంత్రి బంధువు కూడా భాను భూ దందాలకు తోడ్పాటునందించినట్లు తెలిసింది. రాజధాని శివార్లలో భూ దందాలు, సెటిల్మెంట్లకు వారు భానుకిరణ్ను ఉపయోగించుకున్నట్లు తేలింది. తొమ్మిది రోజులపాటు సీఐడీ కస్టడీలో ఉన్న భానుకిరణ్ అధికార, ప్రతిపక్ష నేతలతో కలిసి తాను చేసిన భూ దందాల వివరాలను పూస గుచ్చినట్లు వెల్లడించాడు. టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడితో కలిసి చేసిన దందాల వివరాలను కూడా బట్టబయలు చేశాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో వందల కోట్ల విలువైన అనేక ఎకరాల భూమి సెటిల్మెంట్లో టీడీపీ యువ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి కుమారుడు కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ విచారణలో భాను వెల్లడించాడు. అయితే భానుకిరణ్ చెపుతున్న విషయాలకు అనుగుణంగా పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాతే.. అతనితో కలిసి సెటిల్మెంట్లలో పాల్గొన్నవారి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని సీఐడీ అధికారులు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment