'త్వరలో రాష్ట్రానికి పట్టిన శనిపోతుంది' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'త్వరలో రాష్ట్రానికి పట్టిన శనిపోతుంది'

'త్వరలో రాష్ట్రానికి పట్టిన శనిపోతుంది'

Written By news on Thursday, May 10, 2012 | 5/10/2012

సీఎల్పీ కార్యాలయం వద్ద గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ మంత్రి శంకర్రావు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు యత్నించగా ఆయన ప్రయత్నం ఫలించలేదు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిపే హాల్ కు తాళం వేసి ఉండటంతో శంకర్రావు మెట్లమీదే కూర్చొని విలేకర్లతో మాట్లాడారు.

ఈ సందర్భంగా శంకర్రావు మరోసారి ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 12వ తేదీ తర్వాత రాష్ట్రానికి పట్టిన శని వీడుతుందని, ప్రజలు సంతోషిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదని శంకర్రావు స్పష్టం చేశారు. మంత్రులు, ఇతర సీనియర్లే వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు సీఎల్పీలో ఎలక్షన్ ను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అయిన తన హక్కులకు భంగం కలిగించారని తనకు జరిగిన అవమానంపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని శంకర్రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేది తాను కాదని, సీఎం ఆయన మద్దతు దారులే సస్పెండ్ అవుతారన్నారు. తనకు జరిగిన అన్యాయం అధిష్టానం దృష్టికి వెళ్లిందని శంకర్రావు తెలిపారు.
Share this article :

0 comments: