వైఎస్ జగన్ను సీబీఐ అరెస్టు చేయడంపై వైఎస్ విజయమ్మ తీవ్రంగా స్పందించారు. ఈరోజు జగన్ను అరెస్టు చేసిన వెంటనే ఆమె దిల్కుషా అతిథి గృహానికి చేరుకుని జగన్ను కలుసుకున్నారు. అనంతరం ఆమె అతిథి గృహం బయట మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఓదార్పు యాత్రను జగన్ చేయడమే తప్పా అని ఆమె ప్రశ్నించారు. జగన్ను అరెస్టు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలనుకుంటున్నాయని నిలదీశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేక మరెక్కడయినా ఉన్నామా అని సందేహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే తన భర్త మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. జగన్ను ప్రజలు ఆదరించడమే తప్పా ఏంటి అని అన్నారు.
Home »
» కంటతడిపెట్టిన వైఎస్ విజయమ్మ
కంటతడిపెట్టిన వైఎస్ విజయమ్మ
Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment