కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి నియోజకవర్గ ప్రజల్ని, వారి సమస్యల్ని పట్టించుకోకుండా చిరంజీవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేగా తిరుపతి నియోజగవర్గానికి చిరంజీవి చేసింది ఏమీ లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవి ఎమ్మెల్యే అయ్యాక తిరుపతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు.
త్వరలో సువర్ణయుగం వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసి తిరుపతి ప్రజలకు తాగునీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన తిమ్మనాయుడు పాలెంలో పర్యటించారు.
త్వరలో సువర్ణయుగం వస్తుందని వైఎస్ జగన్ అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసి తిరుపతి ప్రజలకు తాగునీటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన తిమ్మనాయుడు పాలెంలో పర్యటించారు.
0 comments:
Post a Comment