ఆ వ్యక్తిది పైశాచిక ఆనందం:'నమస్తే తెలంగాణ' సీఈవో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ వ్యక్తిది పైశాచిక ఆనందం:'నమస్తే తెలంగాణ' సీఈవో

ఆ వ్యక్తిది పైశాచిక ఆనందం:'నమస్తే తెలంగాణ' సీఈవో

Written By news on Saturday, May 19, 2012 | 5/19/2012

రాష్ట్రంలో ఒక పత్రిక నిర్వహిస్తోన్న వ్యక్తి తన చేష్టల ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని 'నమస్తే తెలంగాణ' సీఈవో కట్టా శేఖర్‌రెడ్డి మండిపడ్డారు. జర్నలిస్టుల ర్యాలీలో పాల్గొంటే ఉద్యోగాలు పోతాయని ఆవ్యక్తి తమ ఉద్యోగులను హెచ్చరించారని విమర్శించారు.


ఆయనకు మనసు లేదా అంటూ శేఖర్‌రెడ్డి నిలదీశారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండు టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'సాక్షి' పత్రికకున్న కోటి 40 లక్షల మంది పాఠకుల స్వేచ్ఛమీద దాడి జరుగుతున్నందున ఈ దాడిని ప్రతిఘటిస్తున్నామని అన్నారు. పత్రిక నిర్వహణకు ఆటంకం కలిగించే ఏ చర్యనైనా వ్యతిరేకిస్తామని కట్టా శేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Share this article :

0 comments: