ప్రత్తిపాడు..16,781,కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రత్తిపాడు..16,781,కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

ప్రత్తిపాడు..16,781,కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

రెండోస్థానంలో టీడీపీ 
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత.. సమీప టీడీపీ అభ్యర్థిపై 16,781 మెజార్టీతో విజయదుందుభి మోగించారు. నియోజకవర్గ ఆవిర్భానంతరం నమోదైన రికార్డు మెజార్టీ ఇది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా కందుకూరి వీరయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్‌బాబు పోటీ చేశారు. సుచరిత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలుకొని చివరి రౌండ్ వరకు అత్యధిక రౌండ్‌లలో ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. 

ఏడో రౌండ్‌లో తెలుగుదేశం పార్టీ 98 ఓట్లు, ఎనిమిదో రౌండ్‌లో 1,020 ఓట్ల ఆధిక్యతను మాత్రం కనబరిచింది. జిల్లాలో మొట్టమొదటిసారిగా అధికార పార్టీ డిపాజిట్ పూర్తిస్థాయిలో గల్లంతయిం ది. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు సహా అనేక మంది ప్రముఖులు వచ్చి ప్రచారం చేసినా సుధాకర్‌బాబును గట్టెక్కించలేకపోయారు. ప్రతిపక్ష టీడీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ కూడా పనిచేయలేదు.

ప్రజాకోర్టులో జగన్ నిర్దోషి: సుచరిత

ప్రజాకోర్టులో జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషి అని ఉపఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లమైందని మేకతోటి సుచరిత పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని నిలుపుకొనేలా జగనన్న నేతృత్వంలో పనిచేస్తానన్నారు. 
Share this article :

0 comments: