టీడీపీకి 2, 3 స్థానాలు సగం-సగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీకి 2, 3 స్థానాలు సగం-సగం

టీడీపీకి 2, 3 స్థానాలు సగం-సగం

Written By news on Friday, June 15, 2012 | 6/15/2012

ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ ఒక్క సీటు కూడా గెలవలేకపొయింది. అన్ని స్థానాల్లో ఈ పార్టీ రెండు, మూడు స్థానాలకు పరిమితమయింది. 18 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 9 సీట్లలో రెండోస్థానం, మరో 9 నియోజకవర్గాల్లో మూడో స్థానంలో నిలిచింది. అంటే రెండు, మూడు స్థానాలు సమానంగా దక్కించుకుందన్నమాట. 

అనంతపురం అర్బన్, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఉదయగిరి, ఒంగోలు, మాచర్ల, పత్తిపాడు, పోలవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. 

పరకాల, తిరుపతి, ఆళ్లగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, నర్సాపురం, రామచంద్రాపురం, నర్సన్నపేటల్లో మూడో స్థానానికి పరిమితమయింది.


18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. ఆయన 56891 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఎం. రాంప్రసాదరెడ్డిపై విజయ ఢంకా మోగించారు. శ్రీకాంత్‌రెడ్డికి 90978 ఓట్లు, రాంప్రసాదరెడ్డికి 34087 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం 25344 ఓట్లు దక్కించుకున్నారు. 

మరోవైపు హోరాహోరీగా సాగిన వరంగల్ జిల్లా పరకాల స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భిక్షపతి 1562 ఓట్ల స్వల్ప మెజారిటీలో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటీ ఇవ్వడంతో ఆయనకు అత్యల్ప మెజారిటీ దక్కింది. 

నెల్లూరు లోక్‌సభ స్థానానికి పోటీచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 291745 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి టి. సుబ్బిరామిరెడ్డిపై ఘన విజయం సాధించారు. 
Share this article :

0 comments: