ఒంగోలు.. 27,403, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒంగోలు.. 27,403, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

ఒంగోలు.. 27,403, కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగోసారి ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 27,403 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. కాగా జిల్లా కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా ఆ పార్టీ అభ్యర్థి మాగుంట పార్వతమ్మ డిపాజిట్ కోల్పోయారు. 

శుక్రవా రం కౌంటింగ్ సందర్భంగా తొలి రౌండ్‌లో టీడీపీకి 366 ఓట్ల మెజారిటీ రావడం ఉత్కంఠ రేకెత్తించింది. ఆ పార్టీకి రెండో రౌండ్ నుంచి 1,189 ఓట్ల మెజారిటీ లభిం చిం ది. ఇక అక్కడ్నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌కాంగ్రెస్ మెజారిటీ పెరుగుతూనే ఉంది. చివరకు 27 వేలకు పైగా వచ్చిన భారీ మెజారిటీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

కనువిప్పు కావాలి: బాలినేని

‘‘నా గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలి. వైఎస్సార్ కుటుంబాన్ని వేధిస్తున్న కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయం’’
Share this article :

0 comments: