రాష్ట్రంలో పెనుమార్పులు ఖాయం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో పెనుమార్పులు ఖాయం

రాష్ట్రంలో పెనుమార్పులు ఖాయం

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

 ఉప ఎన్నికలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకపక్షంగా గెలిస్తే రాజకీయాలలో పెను మార్పులు సంభవించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడూ ఇంత పెద్దస్థాయిలో ఉపఎన్నికలు జరగలేదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎమ్మెల్యేలు వైఎస్ జగన్‌వైపు వెళ్తున్నారని చెప్పారు. 

పరకాలలో వైఎస్ విజయమ్మ ప్రచారానికి భారీ జనం రావడం ఆ పార్టీకి లాభం చేకూర్చగలదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విదేశాలలో వేలకోట్ల రూపాయల నల్లధనం ఉందని వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాం డ్ చేశారు. వైఎస్‌కు ప్రమాదం జరగనున్నట్లు తనకు తెలిసి ఉంటే ప్రాణాలను పణంగా పెట్టయినా కాపాడుకునే వాళ్లమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య లు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు.
Share this article :

0 comments: