సీఎం తీరుపై లక్ష్మీపేట మృతుల ఆందోళన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం తీరుపై లక్ష్మీపేట మృతుల ఆందోళన

సీఎం తీరుపై లక్ష్మీపేట మృతుల ఆందోళన

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

శ్రీకాకుళం: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తీరుపట్ల లక్ష్మీపేట మృతుల బంధువుల ఆందోళన చేపట్టారు. సీఎం ఎటువంటి హామీ ఇవ్వలేదని లక్ష్మీపేట మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాక దళితేరులను సంతృప్తి పరచడానికేనని బంధువులు ఆరోపించారు. లక్ష్మీపేట బాధితులను రాజాం ప్రభుత్వాస్పత్రిలో సీఎం కిరణ్ పరామర్శించారు. 

శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని లక్ష్మీపేట గ్రామంలో మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ముంపు మినహా మిగులు భూముల వివాదంపై మంగళవారం జరిగిన కొట్లాటలో నలుగురు దళితులు మృతి చెందారు. మరో 31 మంది గాయపడ్డారు. ఇరువర్గాలు నాటుబాంబులు, కర్రలు, గొడ్డళ్లు, బల్లేలు, కత్తులు తదితర ఆయుధాలు ఉపయోగించి పరస్పర దాడులకు దిగారు.
Share this article :

0 comments: