పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలోని పలు పోలింగ్ కేంద్రాలలోని ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించాయి. దాంతో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాలలో ఈవీఎం పనిచేయడంలేదు. 
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ లో బూత్ నంబర్ 87లో ఈవీఎం మొరాయించింది. వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం ఈడిగపల్లిలో ఈవీఎం పనిచేయడంలేదు. 

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం బూత్ నెంబరు 215లో ఈవీఎం మొరాయించింది. దీంతో ఇక్కడ 25 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఒంగోలు హెచ్ సిఎం స్కూల్లో బూత్ నెంబరు 118లో ఈవీఎం పనిచేయలేదు. కమ్మపాలెంలో 120వ బూత్ లో ఈవీఎంలో ఫ్యాన్ గుర్తు పనిచేయడం లేదని ఓటర్లు ఫిర్యాదు చేశారు.
Share this article :

0 comments: