మైనార్టీ రిజర్వేషన్ పై స్టేకు నిరాకరించిన సుప్రీం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మైనార్టీ రిజర్వేషన్ పై స్టేకు నిరాకరించిన సుప్రీం

మైనార్టీ రిజర్వేషన్ పై స్టేకు నిరాకరించిన సుప్రీం

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

మైనార్టీ రిజర్వేషన్ ఉప కోటాకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మైనార్టీ ఉప కోటా చెల్లదని ఎపి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐఐటి విద్యార్థుల ప్రవేశానికి ఆటంకం కలుగకుండా ఉండటానికి తాము స్టే ఇవ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మతం ఆధారంగానే ఉప కోటా ఇచ్చారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సబ్ కోటా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కోర్టు పేర్కొంది. బీసీలకు ఇస్తున్న 27 శాతం రిజర్వేషన్ లో ఏ ఆధారంగా 4.5 శాతం ఉప కోటా నిర్ణయించారని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాజ్యాంగ నిబద్ధత ఏమిటో కూడా తెలపాలని కోర్టు కోరింది. జాతీయ బీసి, మైనార్టీ కమిషన్లను సంప్రదించారా? అని కోర్టు కేంద్రంని ప్రశ్నించింది. రాజ్యంగ సంబంధమైన విషయాలలో కేంద్రం స్పష్టంగా ఉండాలని కోర్టు తెలిపింది. అయితే ఉప కోటాపై విచారణకు కోర్టు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత ప్రతివాదులకు కోర్టు నోటీసులు పంపింది.
Share this article :

0 comments: