వైఎస్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లుగానే దీని వెనుక ప్రభుత్వ కుట్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లుగానే దీని వెనుక ప్రభుత్వ కుట్ర

వైఎస్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లుగానే దీని వెనుక ప్రభుత్వ కుట్ర

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పట్ల జైలు అధికారులు, సీబీఐ వ్యవహరించిన తీరు అత్యంత దుర్మార్గం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు పేర్కొన్నారు. ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లుగానే దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. సీబీజేడీ లక్ష్మీనారాయణకే నార్కో టెస్టులు చేయాలని ఆయన అన్నారు. లక్ష్మీనారాయణకు నార్కో టెస్టులు చేస్తే కుట్రలో ఎవరున్నారో తెలుస్తుందన్నారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. బాబా రామ్ దేవ్ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలవడం మేకపిల్ల పులిని మద్దతు అడిగినట్లుగా ఉందన్నారు. కోలా కృష్ణ మోహన్ ఆరోపణల నుంచి ప్రజలను మళ్లించడానికి బాబు జిమ్మిక్కులు చేస్తారని చెప్పారు. బాబా రామ్ దేవ్ కు ఇది మంచిదికాదని సలహా ఇచ్చారు. చంద్రబాబు గురించి రామ్ దేవ్ నిజాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.
Share this article :

0 comments: