'జగన్ సీఎం అయితేనే మైనార్టీలకు మేలు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'జగన్ సీఎం అయితేనే మైనార్టీలకు మేలు'

'జగన్ సీఎం అయితేనే మైనార్టీలకు మేలు'

Written By news on Wednesday, June 13, 2012 | 6/13/2012

మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రెహ్మాన్‌ ఆరోపించారు. మహానేత వైఎస్‌ఆర్ లేని లోటు మైనారిటీలకు స్పష్టంగా కనపడుతోందని ఆయన అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణం తర్వాత ముస్లింలంతా కాంగ్రెస్‌ నుంచి వీడారని రెహ్మాన్ అన్నారు.

మైనారిటీల సంక్షేమాన్ని మరిచిన ఆజాద్, అహ్మదుల్లా, సల్మాన్ ఖుర్షీద్‌లు వెంటనే రాజీ నామా చేయాలని రెహ్మాన్ డిమాండ్ చేశారు. మైనార్టీ రిజర్వేషన్లను పునురుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

సుప్రీం తీర్పుపై NHRCకి ఫిర్యాదు చేస్తామన్నారు. మళ్లీ సుప్రీంకోర్టులో మైనార్టీ రిజ్వర్వేషన్లపై అప్పీల్ చేస్తామని.. జగన్ సీఎం అయినప్పుడే మైనార్టీలకు మేలు జరుగుతుందని రెహ్మాన్‌ అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: