మొగల్తూరు(పశ్చిమగోదావరి జిల్లా): కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సొంతూరుకు మరోసారి ముఖం చాటేశారు. నర్సాపురం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన బుధవారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. అయితే రెండో రోజు ప్రచారంలో భాగంగా మొగల్తూరులో నిర్వహించిన రోడ్ షోకు చిరంజీవి డుమ్మా కొట్టారు. మొగల్తూరు ముఖం చూడకుండానే వెనుదిరిగారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంవల్లే చిరంజీవి మొగల్తూరు వెళ్లలేదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. గతంలో పలు కార్యక్రమాలకు ఆహ్వానించినప్పటికీ చిరంజీవి ఎప్పడూ సొంతూరుకు రాకపోవడమే స్థానికుల ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
Home »
» మొగల్తూరుకు ముఖంచాటేసిన చిరంజీవి
మొగల్తూరుకు ముఖంచాటేసిన చిరంజీవి
Written By news on Thursday, June 7, 2012 | 6/07/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment