అన్ని సీట్లూ మావే: శంకర్రావు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్ని సీట్లూ మావే: శంకర్రావు

అన్ని సీట్లూ మావే: శంకర్రావు

Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012

 ఉప ఎన్నికల్లో అన్ని సీట్లూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని మాజీ మంత్రి శంకర్రావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకే ఈ క్రెడిట్ దక్కుతుందని, ఫలితాలు వెల్లడైన వెంటనే వారికి కచ్చితంగా పదోన్నతి దక్కుతుందని ఎద్దేవా చేశారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిరణ్, బొత్సలు విజయవంతమయ్యారని వ్యాఖ్యానించారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మంచి భవిష్యత్ ఉందని ఆయనీ సందర్భంగా చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అధిష్టానం తొందర్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.
Share this article :

0 comments: