వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ కోరడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి చిదంబరం, సీఎం కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఈనాడు అధినేత రామోజీ, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణలకు నార్కో టెస్ట్ చేస్తే జగన్పై, దివంగత వైఎస్ కుటుంబంపై వీరందరూ చేస్తున్న గూడుపుఠాని బయటపడుతుందన్నారు. అంతేకాకుండా దివంగత వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం వెనకున్న కుట్ర కూడా బయటపడుతుందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
Home »
» సోనియాకు నార్కోటెస్ట్ చేయాలి
సోనియాకు నార్కోటెస్ట్ చేయాలి
Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment