బాధితులకు అండగా ఉంటాం: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాధితులకు అండగా ఉంటాం: విజయమ్మ

బాధితులకు అండగా ఉంటాం: విజయమ్మ

Written By news on Saturday, June 16, 2012 | 6/16/2012

శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో ముంపు మినహా మిగులు భూముల వివాదంపై ఈనెల 12న జరిగిన కోట్లాటలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పరామర్శించారు. ఘటనకు దారి తీసిన వివరాలను బాధితులను అడిగి ఆమె తెలుసుకున్నారు. అన్నివిధాలా అండగా ఉంటామనికి వారికి భరోసా ఇచ్చారు. 

విజయమ్మ వెంట ఆమె కుమార్తె షర్మిల, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. లక్ష్మీపేట ఘటనలో నలుగురు దళితులు మృతిచెందగా, 31 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: