నేటితో ముగియనున్న కస్టడీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటితో ముగియనున్న కస్టడీ

నేటితో ముగియనున్న కస్టడీ

Written By news on Sunday, June 10, 2012 | 6/10/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు. జగన్‌ను మరో రెండు రోజులు విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ఆయన్ని ఉదయం 10.30 గంటలకు పటిష్ట బందోబస్తు మధ్య చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని కేంద్రీయ సదన్‌కు తీసుకువచ్చారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఆయన్ని విచారించింది. సాయంత్రం 5 గంటలకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రంతో విచారణ ముగియనుంది.
Share this article :

0 comments: