ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు మహిళా ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలున్నాయి. పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్, ప్రత్తిపాడు మండలాలలో వట్టి చెరుకూరు, గుంటూరు రూరల్, ప్రత్తిపాడు మండలాల్లో పోలింగ్ పుంజుకుంటోంది. ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనిమిది వేల దాకా ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా వుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకతోటి సుచరిత, కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ బాబు, టిడిపి అభ్యర్థి కందుకూరి వీరయ్యల మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతోంది. పునర్విభజన తర్వాత అంటే 2009 నుంచి ఈ నియోజకవర్గం ఎస్ సి రిజర్వుడు నియోజకవర్గమైంది.
Home »
» కదలివస్తున్న మహిళా ఓటర్లు
కదలివస్తున్న మహిళా ఓటర్లు
Written By news on Tuesday, June 12, 2012 | 6/12/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment