రాజన్న కావ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న కావ్యం

రాజన్న కావ్యం

Written By news on Saturday, July 7, 2012 | 7/07/2012


రాజన్న !
కవిని కాకున్నా కవిలా ఒక కావ్యం రాద్దామని ఎప్పటినుండో కకృత్తి పడేవాడ్ని
కాని కదిలే కావ్యంగా నువ్వు ఉన్నంత కాలం
ఆ సాహసం చెయ్యలేక పోయాను.
నీ తెల్లని పంచ కట్టుతో జత కట్టి
మా చీకటి బతుకులు సైతం
తెల్లవారుతాయన్న సందేశాన్నిచ్చిన నీ చల్లని
నవ్వుకున్నా చల్లని కావ్యం ఎలా పుడుతుంది ?
గోదావరి బ్యాసిన్ గ్యాసు విషయాన గ్యాసు మనుషులంతా
గ్యాసు కొడుతుంటే
నువ్వు కళ్ళు చిట్టించగా వచ్చి పడ్డ మెరుపుకన్న , నీ తెలుగు పౌరుషంకన్నా
వాడి వేడైన కావ్యం ఎలా పుడ్తుంది ?
ఆ మెరుపు ఎంత శక్తిమంతమైనవంటే చివరికి
నువ్వు బతికుంటే వారి బతుకులు భయిట పడి పోతాయని
వారిని వనికించింది.
నువ్వు మరణిస్తేనే వారికి బతుకని భయపెట్టింది.
వారి భయం మాకు అభయమై ఉన్న నీకు అపాయంగా మారింది.
రాజన్నా !
నువ్వు అర్ద దశాబ్దమే పరిపాలించావని అర్దాంతంగా పోయావని
కొందరు భ్రమ పడుతున్నారు
నువ్వు ఒక శతాబ్ద కాల అభివృద్దిని
సంక్షేమాన్ని అందించి అంబరానికి ఎగిసి పోయావు.
అక్కడి దేవతల, అమరుల స్థాయికి ఎదిగి పోయావు
ఈ సత్యం ఇక నిత్యం వారికి సైతం గుర్తుండి పోతుంది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు – వాటిలో నీ పేరు
సాధించిన విజయం
ఎన్నటికీ మరువలేరు వారు.
నేడు బాహుటంగా బయిట పడింది
ప్రజాభిప్రాయాన్ని దిక్కరించి
తిక్క తిక్కగా కలుపు మొక్కలకు
నీరు పోసే ఆదిష్ఠానం యొక్క తత్వం
నువ్వెలా భరించావయ్యా ఈ తరహా యాతన
ఒక్కోసారి అక్కడి శిలువ దిగి గాని రాజదానికి చేరేవాడివి కాదేమో
నువ్వు వెళ్ళి పోయాక – నువ్వు తెచ్చి పెట్టిన అధికారాన్ని
బినామి ఆస్తిగా ఉంచి లబ్ది పొంద చూసారే కాని
నువ్వు ఏ మాట ఇచ్చి ఆ అధికారాన్ని తెచ్చి పెట్టావో
క్షణం కూడ ఆలోచించలేదు.
నువ్వు హిమాలయాన్ని కరిగిస్తానని మాటివ్వలేదు
హిందు మహాసముద్రాన్ని ఇంకిస్తానని చెప్ప లేదు
పేదవానికి ఇంకొంత బియ్యమిస్తానన్నావు
రైతుకు మరో రెండు గంటల విద్యుత్ ఇస్తానన్నావు.
నీ మాటతో వీరికి పని లేదు
కాని ఆ గద్దె పట్టుకుని నల్లుల్లా వ్రేలాడటం మాత్రం వచ్చు..
చీ ..చీ..
అక్కడేమో నెహౄ పోతే ఇందిర – ఇందిర పోతే రాజీవ్
రాజీవ్ పోతే సోనియా – సోనియా పోక ముందే రాహుల్
ఇంతకీ అధికారం దక్కక మునుపు వారీ దేశం కోసం కాని -కాంగ్రెస్ పార్టి కోసం కాని
వెలగ పెట్టింది ఏమి లేదు.
వారసత్వంగా లభించిన పగ్గాలతో వారు వేసినవి పిల్లి మొగ్గలే
ఇది అక్కడి దృశ్శం.
మరి ఇక్కడేమో…
ప్రజా స్వామ్యమంటే అది నాలుగు స్థంబాలాట
లెజిస్లేచర్, ఎగ్సిక్యూటివ్, జుడీషియరి.
నాలుగో స్థంభం మీడియా.
ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన పత్రికలు
ఏకంగా తమ కోరికలను ,ప్రజా భిప్రాయాలుగా సమాజం పై రుద్దే
ప్రయత్నం చేసినప్పుడు
యెల్లో మీడియా దూకుడుకు అడ్డు కట్ట వేస్తే కాని కాంగ్రెస్ గట్టెక్కదన్న
క్లీష్థ పరిస్థితిలో ఆంథ్ర రాష్ఠ్ర ప్రజల మన: సాక్షిగా వెలిసింది సాక్షి
నాడు సాక్షి వెలిసి ఉండక పోతే కాంగ్రెస్ మట్తిలో కలిసి పోయేది.
ఆ సాక్షిని తెచ్చింది జగన్. నిలపెట్టింది జగన్.
నాడు జగన్ లేకుంటే సాక్షి లేదు. సాక్షి లేకుంటే విజయం లేదు
కాని ఆ జగన్ను ఏంచేసింది అదిష్ఠానం?
పెళ్ళి కొడుకును తోడు పెళ్ళి కొడుకు చేసిన చందాన
రోశయ్యను సి.ఎం గా ప్రపోజ్ చెయ్యమంది.
చెదరని చిరునవ్వుతో – అదీ చేసాడు జగన్.
జనం నీ మరణంతో తమకున్న ఏకైక బరోసా
పోయిందని గుండె పగిలి చస్తే -ప్రాణార్పణ చేస్తే
ఆ మృతుల కుటుంభాలకు ఓదార్పై భయలు దేరాడు
నీ కుమారుడు..
జనం నీరాజనం పలికేరు. అదిష్ఠానానికి వెన్నులో చలి పుట్టింది.
బాధితిలను ఒక చోటకు చేర్చి ఓదార్చాలనేరు.
నువ్వు మాకు కేవలం విధేయత పాఠాలే నేర్ప లేదు.
ఆత్మగౌరవ పాఠాలు కూడ నేర్పావు కదా..
ఎక్కడో ఉన్న మేం సైతం బుద్దిగా చదువుకుంటుంటే
నీ నీడన పెరిగిన ఆ పులి బిడ్డ నేర్చి ఉండదా పాఠాలు?
పార్ఠి మనుగడ కోసం ఈనాడు -ఆంథ్రజ్యోతి వంటి కొండలతో డీ కొట్టిన సాక్షి చేదైంది
ఆ సాక్షిని నెలకొల్పిన జగన్ చేదయ్యాడు. కాని వాడయ్యాడు.
కాని నువ్వు రాష్ట్ర ప్రజా దనాన్ని ఆదిష్ఠానానికి దోచి పెట్టావని
నీలాప నిందలు వేసిన వారు మాత్రం అయినవారయ్యేరు.
వారి గుమ్మం ముందు చెయ్యి చాచి
నిలబడేరు.
నపుంసకుని వద్ద పుత్రదానం యాచించినట్టు
ప్రజలచే తిరస్కరింప వారి చరణు వేడి
ప్రజాబలం పొంద చూసేరు.
రాజన్నా !
ఇవన్ని నీకు తెలియవని కాదు. నువ్వు ఊహించనివి కావు.
నువ్వు చూసి ఎరుగని అదిష్ఠానమా ఇది?
అందుకే డిల్లిలో నిన్ను కలిసి ప్రశ్నల వర్షం కురిసే విలేకర్లతో చెప్పేవాడివేమో ?
మీరడగ కూడదు నేను చెప్ప కూడదని
అడగ కూడనివి , చెప్ప కూడనివి సైతం దిగ మ్రింగి మా పళ్ళాలను అన్నంతో నింపావు .
విషం తాను మ్రింగి అమృతం పంచిన రుద్రుడిలా
అందుకే నీ ముక్తి స్థలి రుద్ర కొండ అయ్యిందేమో.
హే రాజన్నా !
మనిషిగా పుట్టిన నువ్వు
మహాత్మునిగా ఎలా ఎదిగావయ్య ?
నువ్వు నీ ఆత్మ కథ రచించి ఉంటే అది మరో సత్య శోధన అయ్యేదేమో?
కేవలం విదేశి కంపెనీలకు భూ తర్పణాలకే పరిమితమైన కసాయి గుండెలకేం తెలుసు
ప్రజల గుండెలో ఇంత చోటు ఎంత విలువైందో ?
ప్రేమలో పడ్డాకే అత్త కూతురి కట్టు, బొట్టు తెలిసొచ్చినట్టుగా
2003 పాద యాత్రలోని నీ అడుగులు ప్రజల గుండెకేసే అన్న సత్యం
నాకు బోధ పడలేదు.
నాయకుడు పుడతాడని కొందరు
కాదు కాదు తనే శిలై, తనే శిల్పి అయ్యి తీర్చి దిద్దుకుంటాడని మరి కొందరు
అంటుంటే తలపట్టుకుంటిని
ఆ ప్రశ్నకు జవాబు ఏ చరిత్రలోను దొరక్క
నీ జీవిత పుస్తకం తెరిచా సమాదానం చూసి మురిసా…
అన్నట్టు జీవిత పుస్తకం ఏంది సిల్లీగా .. అదో చరిత్ర..
నాయకుడు పుడతాడు రేగు చుక్కలా ?
ప్రజల జీవితాలను కారు చీకటి కమ్ముకున్న వేళ
వారి కళ్ళు తమ ఇల వేల్పు కొరకు ఆకాశానికేసి
చూస్తే……….
అప్పుడు కనిపిస్తుంది ఆ రేగు చుక్క !
ఈ ముక్క నాకు తెలిపిన నీ జీవితం ధన్యం
ఆ చుక్క ఎప్పుడో పుట్టింది
ప్రజ కంట మరెప్పుడో పడింది
హే జన హృదయ నేత !
కొందరు నయవంచకులు
మా నమ్మకాలను వొమ్ము చేసి
మమ్ము ప్రపంచ బ్యాంకుకు అమ్మ చూస్తే
ఆ అంబ అమ్ముల పొదిలోని ఆగ్నేయాస్త్రంలా అడుగు ముందుకేసావు
కరుణ అడుగంటిన అవకాశ వాదులను చెడుగుడు ఆడించావ్
శల్య సారథ్యాలు, స్వపక్షీయుల దాడులు,
పద్మవ్యూహాల నడుమ అభిమణ్యువును తలపించావు
అందరు డాక్టర్లు తమ చేతి స్టెత్తు తో రోగి గుండె చప్పుడు వింటారు
కాని నువ్వు రాష్ఠ్ర గుండె చప్పుడు విన్నావు
నాటి హైటెక్ ఇంద్రజాలం పై వాస్తవికతపు మంత్ర జలం చల్లావు
కోడి పిల్ల గుంట నక్కై కనిపించింది.
ఆమ్మో నాటి రోజులు తలుస్తే గుండె లయం తప్పుతుంది
ఆ చీకటి రోజుల్లో రాష్ఠ్ర వ్యవసాయరంగం అహల్యలా బండబారి పోయుంటే
శ్రీరామునివలే నీ పాదం మోపి , ప్రాణం పోసావు.
గుల్బర్గాలో నువ్వు మెడిసిన్ చదువుతున్న రోజుల్లో
నీ అభిమాన కథానాయకుడు ఎన్.టి.ఆర్ .
ఎవరినన్నా ప్రభావితం చెయ్యగల నటుడని నువ్వే కొనియాడిన
అతను రాయల శీమ ప్రాజెక్టులను విశ్మరిస్తే అసెంబ్లీ ముందే నిల బెట్టి నిల దీసావు
ఇది మొన్నటి సత్యం
ఎన్.టి.ఆర్ పేదవానికి కూడు అందించటానికి మొదలు పెట్టిన ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించావు
ప్రత్యర్ది పథకం అమలు చేస్తే కీర్తి ఎక్కడ వారిని వరిస్తుందోనని
కకృత్తి పడక పిల్లి ఏ రంగుదైనా సరే అది ఎలుకలను పట్టాలంతే అంటూ
మాసేదుంగ్ లా అమలు చేసావు రెండు రూపాయలకే కిలో భియ్యం
స్వంత అల్లుడు తుంగలో తొక్కిన పథకానికి పునర్జీవం పోసావు
అసలైన వారసుడ్ని నేనని చెప్పక చెప్పావ్.
నాటి రాజులు సైతం తమ కోటల్లో నిల్వ చేసే వారు బియ్యం
కాని సామాన్యులను వెంటాడింది ఆకలి దెయ్యం
దీంతో భూత వైద్యుని అవతారమూ ఎత్తావు
భూతాన్ని భూస్థాపితం చేసావ్
అభిమానాన్ని రాజకీయాన్ని
స్నేహాన్ని వ్యవహారాన్ని
వేరు చేసి అభిమానం చాటావు
స్నేహాన్ని నిల బెట్టావు
ఆ విశాల హృదయంలోని ఆత్మకు నేల మీదనుండి పైకి ప్రయాణించడం ఇరుకని
నింగికి దగ్గరగా ఉన్న కొండను ఎంచుకున్నావేమో నీ ప్రాణార్పణకు
నాటి పాలకులు నాడు 2 శాతమే ఉన్న నెటిజన్ల కోసం ఇల్లు పీకి పందిరేస్తే
నువ్వేమో 70 శాతం ప్రజానీకాన్ని పోషించే
వ్యవసాయ రంగం పై దృష్ఠి సారించావు
ఆకలితో ఉన్నవానికి చేపలివ్వకు చేపలు పట్టడం నేర్పు అన్నాడో మేధావి
ఆ పూటకు చేపలిచ్చి , చేపలు పట్టడం కూడ నేర్పాలన్నావ్..నువ్వు
అవును రైతుల విద్యుత్ భకాయిలను రద్దు చేసి ఉచిత విద్యుత్ అందించి ఆ పై
మొదలు పెట్టావు జలయజ్ఞం
ఎడ తెగని కరవుతో ఆత్మ స్థైర్యం కోల్పోయిన రైతుల వద్దనుండి
విద్యుత్ భకాయిలను వసూలు చేసి తీరుతామని
హూమ్కరించింది నాటి ప్రభుత్వం
జప్తులు, క్రిమినల్ కేసులతో రైతు గుండెల్లో రైళ్ళు
పరుగుడితుంటే
ఆ అంధకారంలో అరుణ కిరణంలా ఉఅదయించి
మండుటెండల్లో పాదయాత్ర చేపట్టావు.
కాని దాన్ని సైతం భవిష్యత్తు కబ్జల నిమిత్తమే చేసావు సర్వే అని
తూలలాడిన కుర్రకారును చూసాం.
అతను తూలి పడి పుడమి తల్లిను ముద్దాడినప్పుడే అర్థమైంది
సత్యం నిలిచింది నీ వెంటేనని
నువ్వు క్రైస్తవుడని అన్య మత ప్రచారాన్ని ప్రోత్సహించావని గొంతు చించుకున్నవారు
గుళ్ళో పూజారికి, దేవతకు సైతం కాసుల వర్షం కురిపించిన సంగతిని మాత్రం ఏంచక్కా దాచేరు
దాస్తే దాగేదా సత్యం
నీ తండ్రిని పొట్టన పెట్టుకున్నవారిని సైతం క్షమించిన శాంతి పావురమా
అందుకే నీ ముక్తి స్థలి పావురాల గుట్టైందేమో?
హే ఆశ్రిత కల్ప వృక్షమా !
ఇంకో శతాబ్ద కాలానికి నా బో(పోటి) కవులకు సైతం కల్ప వృక్షమయావు నువ్వు
నిన్ను కీర్తించాలని దలచిన అదే క్షణం
సరస్వతి దేవి వారి నాలిక పై ఓంకారం దిద్దినంతగా
ఆసువుగా కవితలు దొరులుతాయి
అశేష ప్రజానీకం సంక్షేమమే సంకల్పంగా నువ్వు ఆశువు బాసినా
మమ్ములను ఆసు కవులు చేసావు
నువ్వూ ఓ తల్లి కడుపునే పుట్టావ్
మరి దేవుడివి ఎలా అయ్యావయ్యా ?
అమరలోకంలోని దన్వంత్రి ఆత్మ నీలో ప్రవేశించిందా ?
ఆరోగ్య శ్రీతో మమ్మాదుకున్నావు
అన్న దాతలకోశం, అన్నార్తుల కోశం నువ్వు చేపట్టిన పాద యాత్రతో
ఆ అన్న పూర్ణేశ్వరి గుండె కరిగి పోయి
శివుని ఆకలి తీర్చిన గరటిని నీకిచ్చిందేమో ?
భిన్న రుచులు కలిగిన లోకులను మురిపించి
వారి అహం మరిపించి ఎలా దగ్గరయ్యావయ్యా ఇన్ని కోట్ల మందికి ?
40 సం.ల వయస్సుకే తేజస్సు క్షీణించి
అబధ్రతకు లోనయ్యే ఈ తరం యువతరం పుట్టుకతో వృద్దులై బతికేస్తుంటే
60 సం.ల వయస్సుకి నువ్వు కలలు కన్న ఉషస్సు కొరకు
పరుగులు తీసి యెనలేని యశస్సును కూడ కట్టుకున్న
నిత్య యవ్వనం నీకెలా సంప్రాప్తించింది
నీ నిస్వార్థమే నిన్ను అమృతమై పరుగులు తీయించిందేమో ?
కాస్త పెద్ద పదవి వరించగానే పేదవాని జీవణ్మరణ సమస్య చీమకాన్న చిన్నదై కనబడే ఈ కలిలో
అంత పెద్ద పదవిలో ఉన్నా పీడిత ప్రజానీకం సమస్యలను ఎలా గుర్తుపెట్టుకో గలిగావు
సరస్వతి ఆకు తిన్నావా ?
చేతికొచ్చిన కొడుకు
చేతి వేళ్ళల్లోని గోళ్ళను కొరుకుతుంటే
మందలించావు
అతను పరోక్షంగా నీ పొగ అలవాటు పై దాడి చేస్తే
పగ అలవాటు లేని నీ గుండెకు
పొగను సైతం దూరం చేసావు
నాడు తీపి మానమని కొడుక్కి సలహా ఇవ్వమని
కోరిన తల్లిని తాను తీపి మానేంత వరకు తిప్పించిన
రామ కృష్ణ పరహంసుని గుర్తుకు తెచ్చావ్
పేరు పేరున పలకరించే నీ మదిలో జ్ఞాపకాలు జాం అయ్యి
ఆ పేరు భయిట పడటానికి ముందు “ఏం షార్” అని పలకరించి
వెన్ను తట్టి కౌగిలించుకునే నాన్నతనం మమ్ము పులకరింప చేస్తుంది
నాడు ఏ కొత్త పథకం అమలు కాకున్నా
ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకున్నా
ఉన్నవి సైతం ఊడ్చుకు పోయినా
అధికారులకు మాత్రం వత్తిడి తప్పేది కాదు
నువ్వు అన్ని సంవత్సరాలు ఎన్నికల సం. వలే పథకాలు అమలు చేస్తున్నా
ప్రాజెక్తులు చేపడుతున్నా వారిని కంటి నిండా నిద్ర పోనిచ్చావ్
పరిపాలన పై నీదైన చెరగని ముద్ర వేసావు
పుట్టనున్న పిల్లల కోసం జననీ సురక్ష పెట్టావ్
గిట్టిన వారి సతీమణుల కోసం వితంతు పించన్లు
వారసులచే తిరస్కరింప బడిన వృద్దులకు పించన్లు
కకా వికలమైన వికలాంగుల బతుకుల్లో వెలుగును నింపే పించన్లు
నువ్వు లెక్కలేని పథకాలు పెట్టి
మేమందరం నీకు ఏడేడు జన్మలకు రుణపడేలా చేసి
ఒక పథకం ప్రకారం శోక సముద్రాన ముంచి వెళ్ళావ్
60 కి విరమిస్తానని
ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసం 10 సం.ల శ్రమ 5 సం.ల్లో చేసి ఇలా వెళ్ళి పోతావా రాజన్నా!
నాకో అనుమానం. అస్తమానం సోమ పాన సేవనంతో స్వర్గ శీమ నరకమైతే
దానిని మళ్ళీ స్వర్గం చేసేందుకు నీకు పిలుపందిందేమో ?
హ..! అదెంత పని నీకు. ఐదేళ్లలో పూర్తి గావించి కీర్తి గాంచి
తిరిగి వచ్చేస్తావుగా రాజన్నా !
ఏళ్ళ తరబడి ఉద్యోగ ఖాళీల భర్తి పై నిషేదం ఉంటే
నిర్వేదంతో నీరశించిన నిరుధ్యోగుల మనసుల్లో కొత్త ఆశలు రేకెత్తించినావు
పంచె కట్టుతో వ్యవాసయ రంగాన్నే కాదు. అభివృద్ది పై వాంచతో
పారిశ్రామీకరణ చే పట్టావ్
ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసావు
పొరుగు రాష్ఠ్రాలు తన్నుకు పో చూసిన పరిశ్ర్మలను ఇక్కడికి తెచ్చావ్
నీ లెక్క లేని పథకాలను ప్రస్తావించటంతో
ఈ కవితాంజలి న్యూస్ బుల్లిటిన్లా ఏడ్చింది
రాజన్నా ! నువ్వు అప్పట్లో ఎం.పి. వి.
పొరుగు రాష్ఠ్రపు టైర్ కంపెని సేల్స్ రెప్ నిన్ను కలవాలని కడప వచ్చాడు
టీ కొట్టులో వాకబు చేసాడు
“ఎం.పి. ఇల్లెక్కడని”
టీ కొట్టువాడు అన్నాడు. అందాక ఎందుకు కాసేపాగు. ఆయనే వస్తాడన్నాడు
అప్పుడు అక్కడికి దూసుకొచ్చింది ఓపెన్ టాప్ జీపొకటి.
దానిని డ్రైవ్ చేసుకుంటూ నువ్వు – నీ పెదాల మీద అదే నవ్వు
అదీ మా రాజన్నంటే .
ఒంటరి సింహం పై అఠవి పందుల దాడి చందాన
ఎన్నికల పోరు సాగితే నీ చేతి కరవాలంగా తిరింగింది సాక్షి
రాజన్నా !
తెలుగు సినిమాల్లో ఒక కథానాయకుడు డజన్ల కొద్ది రౌడీలతో ఉత్తుత్తే ఫైట్ చేస్తే నెత్తికెక్కించుకునేవారు
వారి అభిమానులు
మరి నువ్వు రాజకీయ రణ రంగంలో ఒకే ఒక్కడై ధీరత్వంతో రియల్ ఫైట్ చేస్తే హీరోలు జీరోలయ్యేరు.
అపర చాణక్యుల వ్యూహాలు బెడిసి కొట్టాయి.
పులి బిడ్డ పులేగా..
అందుకే నేడు జగన్ వన్ మ్యేన్ ఆర్మిలా దూసుకు పోతున్నాడు.
ప్రత్యర్థులందరు ఏకమైనా -ఎల్లో మీడియా -సి.బి.ఐ కుమ్మక్కైనా
కించిత్తైనా జంకు బొంకు లేక
దూసుకు పోతున్నాడు నీ బిడ్డ.
కేసులు పెడితే మీసాలు మెలెయ్యడం మానేస్తాడని కలలు కనేరు
వారి కల వికలం అయ్యింది
జైల్లో పెడితే దార్లోకొస్తాడని ఆశించేరు
వారి ఆశ నిరాశే అయ్యింది.
రాజన్నా!
నువ్వు కొలువున్న ప్రతి గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటుంటే
ఆ గుండె చప్పుళ్ళకు జైలు కోడలే కాదు – ఈ ప్రభుత్వాలు సైతం
కుప్ప కూలక తప్పదు.
మా వెంట నువ్వున్నావన్న బరోసా చాలు.
మేమందరం జగన్ వెంట ఉంటాం
నీ బాలకుని మా పాలకుని చేసుకుంటాం
మా రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుంటాం
నీ జలయజ్నం పూర్తి చేస్తాం.
ప్రతి నీటి చుక్కను సేద్యానికి వినియోగిస్తాం!
పండిన ప్రతి గింజతో పేదవాని ఆకలి తీరుస్తాం !!

Share this article :

0 comments: