రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలి: మైసూరా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలి: మైసూరా

రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలి: మైసూరా

Written By news on Thursday, July 5, 2012 | 7/05/2012

ఎరువులు, విత్తనాలు, బ్యాంక్‌ రుణాలు అందక రాష్ట్ర రైతాంగం పడుతోన్న తీవ్ర ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మైసూరారెడ్డి తెలిపారు. శరద్‌పవార్‌తో వైఎస్‌ విజయమ్మ బృందం భేటీ కానుందని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో క్రాప్‌హాలిడే ప్రకటించడం అత్యంత దురదృష్టకమని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారే తప్ప రైతుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్ర రైతుల్ని ఆదుకోవాలని శరద్‌పవార్‌కు విజ్ఞప్తి చేయనున్నట్టు మైసూరారెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: