రోహిత్ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్ డీ తివారీ ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు.
Home »
» రోహిత్ శేఖర్ S/o తివారీ: ఢిల్లీ కోర్టు
రోహిత్ శేఖర్ S/o తివారీ: ఢిల్లీ కోర్టు
Written By news on Friday, July 27, 2012 | 7/27/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment