ఇజాలను మించిన వైఎస్ హ్యూమనిజం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇజాలను మించిన వైఎస్ హ్యూమనిజం

ఇజాలను మించిన వైఎస్ హ్యూమనిజం

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012


ఖమ్మం, న్యూస్‌లైన్: కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే దివంగత నేత వైఎస్‌ఆర్ చెప్పిన హ్యూమనిజం గొప్పదని నమ్మి పలు పార్టీల నుంచి నేతలు వైఎస్‌ఆర్ సీపీలోకి వస్తున్నారని ఆ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు కెకె మహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విసృ్తతస్థాయి సమావేశంలో జిల్లా కన్వీనర్‌గా పువ్వాడ అజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చిన మహేందర్‌రెడ్డి ప్రసంగిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను తట్టుకోలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సైకిల్ కాంగ్రెస్‌గా మారి ఆయనపై కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 

పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎస్‌ఏ రెహమాన్ మాట్లాడుతూ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే రాష్ట్రంలోని 99 శాతం మైనార్టీలు వైఎస్ జగన్‌కు అండగా ఉన్నారని తెలిపారు.కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని శుక్రవారం రాత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో పువ్వాడ అజయ్‌కుమార్ ముస్లిం సోదరులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు డి.రవీంద్రనాయక్, చందాలింగయ్యదొర కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు బాణోత్ మదన్‌లాల్, వి.లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎస్సీవిభాగం క న్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, కార్మిక విభాగం కన్వీనర్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: