బీసీల సంక్షేమం కోరుతూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మకు బుధవారం బీసీ సంఘాలు సన్మానం చేశాయి. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు విజయమ్మను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాధికారంలో బీసీలకు వంద స్థానాలు రిజర్వేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇతర పార్టీల కంటే ఒక్క అడుగు ముందుకేసి విజయమ్మ చేసిన ప్రతిపాదనల పట్ల రాష్ట్రంలోని బీసీలందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా బీసీల అభివృద్దికి కృషి చేయాలన్నారు. వైఎస్ఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా కృష్ణయ్య గుర్తు చేశారు
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాధికారంలో బీసీలకు వంద స్థానాలు రిజర్వేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇతర పార్టీల కంటే ఒక్క అడుగు ముందుకేసి విజయమ్మ చేసిన ప్రతిపాదనల పట్ల రాష్ట్రంలోని బీసీలందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయ కోణంలో చూడకుండా బీసీల అభివృద్దికి కృషి చేయాలన్నారు. వైఎస్ఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా కృష్ణయ్య గుర్తు చేశారు
0 comments:
Post a Comment