వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి బెయిల్ రాకుండా జాప్యం చేసేందుకు ప్రభుత్వ కుట్రపన్నిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కుట్రలో భాగంగానే మంత్రులను బలిపశువులను చేస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులను కూడా బలిచేయాలన్న లక్ష్యం హైకమాండ్ పెద్దలదని విమర్శించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ తరహాలో ఏపీకి చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదర రావు రాజీనామాకు ఇంత కసరత్తు అవసరమా? అని ఆయన ప్రశ్నారు. ఇప్పటికైనా ఢిల్లీలో పైరవీలు మాని రాష్ట్రంలో ప్రజాసమస్యలపై సీఎం దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ వ్యవహారశైలి నీరోచక్రవర్తిని తలపిస్తుందన్నారు.
Home »
» 'జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర'
'జగన్ కు బెయిల్ రాకుండా కుట్ర'
Written By news on Friday, August 24, 2012 | 8/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment