ప్రధాని మన్మోహన్ సింగ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన గ్యాస్ వాటాని తమకు ఇవ్వాలని ఆ లేఖలో ఆమె కోరారు. తమ గ్యాస్ కేటాయింపులను వేరే రాష్ట్రానికి ఇవ్వడం సరైంది కాదన్నారు. తమ రాష్ట్ర వాటాను మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించడం అన్యాయం అని పేర్కొన్నారు. దీనిపై జారీ అయిన ఉత్తర్వులను రద్దుచేయమని కోరారు. తమ సమస్యపై వెంటనే స్పందించాలన్నారు. లేకుంటే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. న్యాయంగా తమకు రావాల్సిన గ్యాస్ వాటా ఇవ్వాలని, తాము చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదేనని ఆ లేఖలో విజయమ్మ పేర్కొన్నారు.
Home »
» ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ
Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment