లక్ష వికలాంగుల పెన్షన్లు రద్దుచేశారని ఆవేదన
పెన్షన్ను రూ. 1000కి పెంచుతామని వైఎస్సార్ సీపీ ప్లీనరీలో జగన్ ప్రకటించారని వెల్లడి
వారికి కష్టసుఖాల్లో అండగా ఉంటామని హామీ
‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు విజయమ్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మంద కృష్ణమాదిగ
హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్రంలో వికలాంగులకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే లబ్ధి చేకూరిందని.. దాదాపు 8.55 లక్షల మందికి నెల నెలా రూ. 500 పెన్షన్ వచ్చేటట్లు చేసిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వికలాంగులకు పెన్షన్గా కేవలం రూ. 75 మాత్రమే ఇచ్చేవారని.. అది కూడా మూడు నెలలకొకసారి వచ్చేవని తెలిపారు.
2004కు ముందు లక్ష మందికి మాత్రమే పెన్షన్లు ఉంటే.. వాటిని వైఎస్ తన హయాంలో 8.55 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు విజయమ్మను కలిశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 న హైదరాబాద్లో నిర్వహించే ‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ ప్రతి విషయాన్నీ మానవతా వాదిగా చూసేవారని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకే ఆఖరు నిమిషం దాకా పరితపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల విషయంలో రాజశేఖరరెడ్డి హయాంలోనే అత్యంత లబ్ధిచేకూరిందన్నారు. చంద్రబాబు హయాంలో వికలాంగుల సంక్షేమం కోసం కేవలం రూ. 9 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ రూ. 496 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. అదేవిధంగా వికలాంగుల వివాహాల కోసం అంతకు ముందున్న ప్రభుత్వాలు కేవలం రూ. 3,000 అందజేస్తే దాన్ని వైఎస్ రూ. 10,000 కు పెంచారని తెలిపారు. చెవిటి, మూగ వారు ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ. 7 లక్షల దాకా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు. అయితే వైఎస్ మరణించాక ప్రస్తుతం మనసులేని ప్రభుత్వం దాదాపు లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లను రద్దు చేసిందని విమర్శించారు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా ఆయన బాటలో నడుస్తారని వికలాంగులకు విజయమ్మ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ మొదటి ప్లీనరీలో వికలాంగులకు నెల నెలా రూ. 1000 పెన్షన్ అందజేయనున్నట్లు జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే కాకుండా అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. వికలాంగుల కష్టసుఖాలలో వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని విజయమ్మ హామీ ఇచ్చారు.
కిరణ్తో అమీతుమీ తేల్చుకుంటాం: కృష్ణ మాదిగ
అంతకుముందు మంద కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం లభించిన తర్వాత చట్టసభల్లో వికలాంగుల తరఫున ఏనాడూ బలమైన చర్చలు జరగలేదన్నారు. వైఎస్ సీఎంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. అందుకే సీఎం కిరణ్తో అమీతుమీ తేల్చుకోవటానికి ఈ నెల 28న సిద్ధమవుతున్నట్లు కృష్ణమాదిగ చెప్పారు. అదేవిధంగా వైఎస్ ఆశయంతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అండగా ఉండాలని విజయమ్మను కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు వారి సమస్యలపై విజయమ్మకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
పెన్షన్ను రూ. 1000కి పెంచుతామని వైఎస్సార్ సీపీ ప్లీనరీలో జగన్ ప్రకటించారని వెల్లడి
వారికి కష్టసుఖాల్లో అండగా ఉంటామని హామీ
‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు విజయమ్మను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన మంద కృష్ణమాదిగ
హైదరాబాద్, న్యూస్లైన్: రాష్ట్రంలో వికలాంగులకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే లబ్ధి చేకూరిందని.. దాదాపు 8.55 లక్షల మందికి నెల నెలా రూ. 500 పెన్షన్ వచ్చేటట్లు చేసిన ఘనత కూడా ఆయనకే చెల్లుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో వికలాంగులకు పెన్షన్గా కేవలం రూ. 75 మాత్రమే ఇచ్చేవారని.. అది కూడా మూడు నెలలకొకసారి వచ్చేవని తెలిపారు.
2004కు ముందు లక్ష మందికి మాత్రమే పెన్షన్లు ఉంటే.. వాటిని వైఎస్ తన హయాంలో 8.55 లక్షలకు పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం హైదరాబాద్లో వికలాంగుల హక్కుల పోరాటసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు విజయమ్మను కలిశారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 న హైదరాబాద్లో నిర్వహించే ‘వికలాంగుల రాజ్యాధికార సభ’కు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ ప్రతి విషయాన్నీ మానవతా వాదిగా చూసేవారని.. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసేందుకే ఆఖరు నిమిషం దాకా పరితపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల విషయంలో రాజశేఖరరెడ్డి హయాంలోనే అత్యంత లబ్ధిచేకూరిందన్నారు. చంద్రబాబు హయాంలో వికలాంగుల సంక్షేమం కోసం కేవలం రూ. 9 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. వైఎస్ రూ. 496 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. అదేవిధంగా వికలాంగుల వివాహాల కోసం అంతకు ముందున్న ప్రభుత్వాలు కేవలం రూ. 3,000 అందజేస్తే దాన్ని వైఎస్ రూ. 10,000 కు పెంచారని తెలిపారు. చెవిటి, మూగ వారు ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ. 7 లక్షల దాకా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించారన్నారు. అయితే వైఎస్ మరణించాక ప్రస్తుతం మనసులేని ప్రభుత్వం దాదాపు లక్ష మందికి పైగా వికలాంగుల పెన్షన్లను రద్దు చేసిందని విమర్శించారు. రాజశేఖరరెడ్డి కుమారుడిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా ఆయన బాటలో నడుస్తారని వికలాంగులకు విజయమ్మ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీ మొదటి ప్లీనరీలో వికలాంగులకు నెల నెలా రూ. 1000 పెన్షన్ అందజేయనున్నట్లు జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే కాకుండా అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. వికలాంగుల కష్టసుఖాలలో వైఎస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని విజయమ్మ హామీ ఇచ్చారు.
కిరణ్తో అమీతుమీ తేల్చుకుంటాం: కృష్ణ మాదిగ
అంతకుముందు మంద కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం లభించిన తర్వాత చట్టసభల్లో వికలాంగుల తరఫున ఏనాడూ బలమైన చర్చలు జరగలేదన్నారు. వైఎస్ సీఎంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ఆయన మరణానంతరం వచ్చిన రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. అందుకే సీఎం కిరణ్తో అమీతుమీ తేల్చుకోవటానికి ఈ నెల 28న సిద్ధమవుతున్నట్లు కృష్ణమాదిగ చెప్పారు. అదేవిధంగా వైఎస్ ఆశయంతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు అండగా ఉండాలని విజయమ్మను కోరారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు వారి సమస్యలపై విజయమ్మకు విజ్ఞాపన పత్రం అందజేశారు.
0 comments:
Post a Comment