రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకమని నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల అత్యంత లబ్ధి పొందిన వ్యక్తి ఆనం అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజకీయ లబ్ధి కోసం వైఎస్ను దుర్భాషలాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక ఆయన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పడరానిపాట్లు పడుతోందని ఆరోపించారు. అందులో భాగంగా మంత్రి ఆనం లాంటి వ్యక్తులు పదవుల కోసం వైఎస్ను దూషిస్తున్నారని, కానీ దాన్ని ప్రజలు హర్షించరని మేకపాటి స్పష్టంచేశారు.
Home »
» ఏరు దాటాక తెప్ప తగలేసే రకం!
ఏరు దాటాక తెప్ప తగలేసే రకం!
Written By news on Saturday, August 25, 2012 | 8/25/2012
రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకమని నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల అత్యంత లబ్ధి పొందిన వ్యక్తి ఆనం అని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు రాజకీయ లబ్ధి కోసం వైఎస్ను దుర్భాషలాడితే ప్రజలు సహించరని హెచ్చరించారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక ఆయన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పడరానిపాట్లు పడుతోందని ఆరోపించారు. అందులో భాగంగా మంత్రి ఆనం లాంటి వ్యక్తులు పదవుల కోసం వైఎస్ను దూషిస్తున్నారని, కానీ దాన్ని ప్రజలు హర్షించరని మేకపాటి స్పష్టంచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment