బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర వడ్డెర సంఘం ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశమై నిర్ణయించినట్లు అధ్యక్షుడు టి.ధర్మరాజు తెలిపారు. వడ్డెర కులాన్ని గుర్తించి, ప్రోత్సహించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్కే దక్కుతుందన్నారు. వడ్డెర కులాన్ని షెడ్యూల్ జాబితాలో చేర్చాలని కేబినెట్లో తీర్మానించి కేంద్రానికి పంపించారని గుర్తు చేశారు. తమ కార్యవర్గ సమావేశానికి నేతలు ఓర్సు కృష్ణయ్య, జె.రెడ్డప్ప, వి.రాముడు, వై.మాధవి, జి.రమణమ్మ తదితరులు హాజరైనట్లు తెలిపారు.
Home »
» విజయమ్మ ప్రతిపాదన హర్షణీయం: వడ్డెర సంఘం
విజయమ్మ ప్రతిపాదన హర్షణీయం: వడ్డెర సంఘం
Written By news on Friday, August 24, 2012 | 8/24/2012
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment