నెల్లూరు : మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిపై నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగతనేత వైఎస్ఆర్ను, జగన్ను ఉద్దేశించి ఆనం దారుణంగా మాట్లాడుతున్నారని వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఆనం బ్రదర్స్ ప్రవర్తన ఏరుదాటాక తెప్ప తగలేసే విధంగా ఉందని మేకపాటి ధ్వజమెత్తారు.
మంత్రి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదని రాజమోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పులు జరుగబోతున్నాయన్న వార్తల దృష్ట్యా తమ స్వలాభం కోసమే ఆనం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు నాయకత్వం చేపట్టినా కాంగ్రెస్ నావను గట్టుకు చేర్చలేరని రాజమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
మంత్రి వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదని రాజమోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మార్పులు జరుగబోతున్నాయన్న వార్తల దృష్ట్యా తమ స్వలాభం కోసమే ఆనం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు నాయకత్వం చేపట్టినా కాంగ్రెస్ నావను గట్టుకు చేర్చలేరని రాజమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment