కేరళలో హెరిటేజ్ పాలు నిషేధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేరళలో హెరిటేజ్ పాలు నిషేధం

కేరళలో హెరిటేజ్ పాలు నిషేధం

Written By news on Tuesday, August 28, 2012 | 8/28/2012

కేరళ: హెరిటేజ్ తోపాటు మరో రెండు పాల బ్రాండ్లపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించింది. పాలలో ప్రమాదకర ఫార్మాలిన్ రసాయనం ఉందని నిషేధం విధించారు. హెరిటేజ్ పాలతోపాటు జేష్మా మిల్క్, మైమా మిల్క్ ని కూడా నిషేధిస్తూ 3 రోజుల క్రితమే కేరళ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పాలు నిల్వ ఉంచడానికి వీటిలో వాడే రసాయనాలలో విషపదార్థం ఉన్నట్లు లేబరేటరీలో పరీక్షించి కనుగొన్నారు. ఆ రసాయనం అధికంగా ఉంటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని అధికారులు తెలిపారు.
Share this article :

0 comments: