- జగన్ను అణగదొక్కడానికి కాంగ్రెస్ కుట్ర
- జీవోలకు మంత్రులదే పూర్తి బాధ్యత
- వాస్తవాలను ధైర్యంగా చెప్పే దమ్ము మంత్రులకు ఉందా?
గుంటూరు, న్యూస్లైన్: వైఎస్ జగన్మోహన్రెడ్డే లక్ష్యంగా చేస్తున్న నీచ రాజకీయ కుట్రలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరినైనా బలిచేయడానికి వెనకాడబోదన్న సంగతి మరోసారి స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేవలం జగన్ను రాజకీయంగా బలహీనపర్చాలని, బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్రపన్ని గోతులు తవ్వుతోందని, చివరకు ఆ గోతిలో కాంగ్రెస్ పార్టీనే పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రుల్ని కూడా బలిపశువుల్ని చేయడానికి వెనకాడకుండా కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందని ఆరోపించారు.
బుధవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. మంత్రులందరూ దివంగత వైఎస్సార్ సంతకాలు పెట్టమంటేనే పెట్టామని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మంత్రులుగా మీరందరూ ఏంచేశారో ఒక్కసారి వాస్తవాలను గమనించి నిర్భయంగా నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. వైఎస్ సంతకాలు పెట్టమన్నారని, జగన్ ఒత్తిడి తెచ్చారని, ఇలా అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు.
ఆనం రామనారాయణరెడ్డి మరీ స్థాయి మించి మాట్లాడుతున్నారని, వై.ఎస్.విజయమ్మ ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అంబటి అన్నారు. ‘‘వైఎస్ కోసం మంత్రులు, ఐఏఎస్లు సంతకాలు చేశారనేది అవాస్తవం. మంత్రులేమీ అనాగరికులు కాదు కదా! మనమంతా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం.. వైఎస్ ఇప్పుడు లేరు, తిరిగి రాలేరు కాబట్టే బురదజల్లుతున్నారు’’ అని అంబటి ధ్వజమెత్తారు. మంత్రులుగా మీకు బుద్ధి, జ్ఞానం ఉంటే వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు డైమండ్బాబు, మామిడి రాము, అల్తాఫ్, చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- జీవోలకు మంత్రులదే పూర్తి బాధ్యత
- వాస్తవాలను ధైర్యంగా చెప్పే దమ్ము మంత్రులకు ఉందా?
గుంటూరు, న్యూస్లైన్: వైఎస్ జగన్మోహన్రెడ్డే లక్ష్యంగా చేస్తున్న నీచ రాజకీయ కుట్రలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరినైనా బలిచేయడానికి వెనకాడబోదన్న సంగతి మరోసారి స్పష్టమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేవలం జగన్ను రాజకీయంగా బలహీనపర్చాలని, బెయిల్ రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్రపన్ని గోతులు తవ్వుతోందని, చివరకు ఆ గోతిలో కాంగ్రెస్ పార్టీనే పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రుల్ని కూడా బలిపశువుల్ని చేయడానికి వెనకాడకుండా కాంగ్రెస్ అధిష్టానం పనిచేస్తోందని ఆరోపించారు.
బుధవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. మంత్రులందరూ దివంగత వైఎస్సార్ సంతకాలు పెట్టమంటేనే పెట్టామని చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మంత్రులుగా మీరందరూ ఏంచేశారో ఒక్కసారి వాస్తవాలను గమనించి నిర్భయంగా నిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. వైఎస్ సంతకాలు పెట్టమన్నారని, జగన్ ఒత్తిడి తెచ్చారని, ఇలా అవాకులు చెవాకులు పేలితే సహించబోమని హెచ్చరించారు.
ఆనం రామనారాయణరెడ్డి మరీ స్థాయి మించి మాట్లాడుతున్నారని, వై.ఎస్.విజయమ్మ ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అంబటి అన్నారు. ‘‘వైఎస్ కోసం మంత్రులు, ఐఏఎస్లు సంతకాలు చేశారనేది అవాస్తవం. మంత్రులేమీ అనాగరికులు కాదు కదా! మనమంతా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం.. వైఎస్ ఇప్పుడు లేరు, తిరిగి రాలేరు కాబట్టే బురదజల్లుతున్నారు’’ అని అంబటి ధ్వజమెత్తారు. మంత్రులుగా మీకు బుద్ధి, జ్ఞానం ఉంటే వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు డైమండ్బాబు, మామిడి రాము, అల్తాఫ్, చిన్నప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment